పంజాగుట్ట పీఎస్లో హరీశ్రావుపై కేసు నమోదు
తన ఫోన్ ట్యాపింగ్ చేశారని.. అక్రమ కేసులు పెట్టి వేధించారని సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదు
BY Raju Asari3 Dec 2024 12:25 PM IST
X
Raju Asari Updated On: 3 Dec 2024 12:32 PM IST
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుపై కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు స్టేషన్లో కేసు నమోదు చేశారు. హరీశ్ పాటు అప్పటి టాస్క్ఫోర్స్ డీజీ రాధాకిషన్రావుపైనా కేసు నమోదైంది. తన ఫోన్ ట్యాపింగ్ చేశారని.. అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 120(బి), 386, 409, 506, రెడ్విత్ 34, ఐటీ యాక్ట్ కింద హరీశ్రావుపై కేసు నమోదు చేశారు.
Next Story