అక్కినేని కుటుంబంలో పెళ్లి బాజాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు డిసెంబర్ 4వ తేదీన ముహూర్తం నిర్ణయించారు. అన్నపూర్ణ స్టూడియోనే పెళ్లి వేదిక. రాత్రి 8.13 గంటలకు ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కానుంది. ఇరు కుటుంబాలు తమ సన్నిహితులు, కుటుంబ సభ్యులకు పంచుతున్న శుభలేఖలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొత్త జంటకు అభిమానులు, సన్నిహితులు ఇప్పటి నుంచే శుభాకాంక్షలు చెప్తున్నారు.
Previous Articleరెండు రాష్ట్రాల ఎన్నికలు.. భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ స్వాధీనం
Next Article మణిపూర్ కు 50 కంపెనీల బలగాలు!
Keep Reading
Add A Comment