సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ భేటీ అయ్యారు. బుధవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈనెల 19న హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తున్న మ్యూజిక్ ఈవెంట్ కు రావాలని సీఎం, డిప్యూటీ సీఎంలను ఆహ్వానించారు. ఆయన వెంట నిర్మాత బండ్ల గణేశ్ ఉన్నారు.
Add A Comment