ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు
మార్కెట్ ప్రారంభంలోనే నెన్సెక్స్ ప్లాట్గా.. నిఫ్టీ 23,000 మార్క్ కింద ట్రేడింగ్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్ గా ట్రేడింగ్ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాల మధ్య మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సూచీలు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. మార్కెట్ ప్రారంభంలోనే నెన్సెక్స్ ప్లాట్గా.. నిఫ్టీ 23,000 మార్క్ కింద ట్రేడింగ్ మొదలుపెట్టాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 86.96 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 75.35 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్సు 2,922.20 డాలర్ల వద్ద కదలాడుతున్నది.
ఉదయం 10.10గంటల సమయంలో సెన్సెక్స్ 24.31 పాయింట్లు తగ్గి 75972.55 వద్ద, నిఫ్టీ 22.25 పాయింట్లు కుంగి 22937.25 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, పవర్గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎంఅండ్ఎం, జొమాటో షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి.