Business

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెబ్‌సైట్‌లో గురువారం ప్రచురించిన నోట్‌లో, బ్లాక్ ఇంక్ సంస్థ తన యూజర్ కౌంట్స్‌ను అతిగా చూపించిందని, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్స్‌ను తక్కువగా చూపించిందని పేర్కొంది. బ్లాక్ ఇంక్ లోని 40 శాతం నుంచి 75 శాతం వరకు ఖాతాలు నకిలీవని ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగులు చెప్పారని తెలిపింది.

అమెరికాకు చెందిన చిన్న బ్యాంకులు, రీజినల్‌ బ్యాంకులు ప్రమాదం అంచున ఉన్నాయని చెప్పారు. బ్రిటన్‌ లోని బ్యాంకులు సైతం ఇలాంటి ముప్పుని ఎదుర్కొంటున్నాయన్నారు.

”చరిత్రలో అత్యంత క్లిష్టమైన ఈ సమయంలో ప్రపంచ బ్యాంకును నడిపించడానికి అజయ్ బంగా సరైన వ్యక్తి. అతను మూడు దశాబ్దాలకు పైగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు పెట్టుబడులను తీసుకురావడంలో విజయవంతమయ్యాడు. అతనికి వ్యవస్థలను నిర్వహించడంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అంతే కాకుండా ప్రపంచ నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు.” అని జో బైడెన్ పేర్కొన్నారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని గగల్‌, దార్లఘాట్లో ఉన్న అదానీకి చెందిన ACC, అంబుజా సిమెంట్ ఫ్యాక్ట‌రీల నుండి రోజూ 7 వేల ట్రక్ లతో సిమెంట్ సరఫరా అవుతుంది. అయితే సిమెంట్ సరఫరాకు ట్రక్ యజమానులు ఎక్కువ ధర వసూలు చేస్తున్నారని అది తమకు లాభదాయకం కాదని అదానీ గ్రూపు తన కంపెనీలను మూసేసింది.

హిన్రీ కిర్క్‌. గూగుల్‌లో త‌న‌లా లేఆఫ్ అందుకున్న మ‌రో ఆరుగురు ఉద్యోగుల‌ను క‌లుపుకొని న్యూయార్క్‌, శాన్ ఫ్రాన్సిస్కోలో డిజైన్‌, డెవ‌ల‌ప్‌మెంట్ స్టూడియో నెల‌కొల్ప‌డానికి సిద్ధ‌మ‌య్యాడు.

వారంలో 3రోజులు ఉద్యోగులు ఆఫీస్ లకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈమేరకు ఉద్యోగులకు మెయిల్స్ పంపించింది అమెజాన్ సంస్థ. మే-1నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.

సోమవారం నాడు జరిగిన విచారణలో ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, సెబీతో సహా ఇతర నియంత్రణ సంస్థలు విచారణ చేయగలవని, అయితే కోర్టు తన తరపున ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి అభ్యంతరం లేదని అన్నారు.

గౌతమ్ అదానీ హిండెన్ బర్గ్ సంస్థను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు అమెరిలోని అత్యంత ఖరీదైన న్యాయ సంస్థలలో ఒకటైన వాచ్ టెల్ సంస్థను నియమించుకుంది. ఇది తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులకు భరోసా ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని అదానీ భావిస్తున్నారు.

పలు అంతర్జాతీయ స్టాక్‌ సూచీలను, వివిధ దేశాల స్టాక్‌ సూచీలను రూపొందించి, నిర్వహించే ఎస్‌అండ్‌పీ డో జోన్స్‌, అదానీ గ్రూప్‌కు పెద్ద షాక్‌ ఇచ్చింది. డో జోన్స్‌ సైస్టెన్‌బిలిటీ ఇండెక్స్‌ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.ఇది ఫిబ్రవరి 7 నుండి అమలులోకి వస్తుంది.