Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, September 21
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    పూజార్హమైన మట్టి గణపతి

    By Telugu GlobalSeptember 18, 20232 Mins Read
    పూజార్హమైన మట్టి గణపతి
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    పురాణేతిహాసాల్లో మట్టి గణపతి ప్రస్తావన ఉందా?

    గణేశ పురాణంలో వినాయక చవితి విధానం చాలా విశేషంగా చెప్పారు. అదేవిధంగా ముద్గల పురాణంలో మనం అనుకునే కేవలం భాద్రపద శుద్ధ చవితి మాత్రమే కాకుండా మొత్తం సంవత్సరం అంతా వచ్చే 24 చవితులు ఎలా చేయాలో, ఒక్కొక్క చవితికి ఒక్కొక్క పేరు, పద్ధతి అన్నీ తెలియజేశారు.

    అంతేకాదు !గణపతి మూర్తిని కేవలం మట్టితోనే కాకుండా ఉత్తమమైన ధాతువులతో, రత్నాలతో చేసి ఎలా ఆరాధించవచ్చోపద్ధతి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా శిలతో, సువర్ణము, రజతము ఇత్యాది ఉత్తమ ధాతువులతో చేసే పద్ధతి, రత్నాలతో గణపతిని చేసే పద్ధతి ఉన్నది.

    కుజ గ్రహ సంబంధమైన ప్రవాళ గణపతి అంటే పగడంతో చేసే గణపతిని ఆరాధించడం ఇలాంటివి రకరకాల పద్ధతులు మనకి పురాణాలు, ఆగమశాస్త్రాలూ చెప్తున్నాయి.

    విశేషించి అనేక రకాల గణపతి వ్రతాలున్నాయి. చవితి వ్రతాలే కాకుండా చతుర్దశి వ్రతాలు, మంగళవార వ్రతాలు, శుక్రవార వ్రతాలు చెప్పబడుతున్నాయి. అంటే స్వామికి చవితితో పాటు చతుర్దశి, వారాలలో మంగళవారం, శుక్రవారం ప్రధానంగా చెప్పబడుతున్నాయి.

    గాణాపత్య సాంప్రదయంలో ఇన్నిరకాల పద్ధతులున్నా ప్రతివారూ చేసేది అందరికీ బాగా తెలిసింది భాద్రపదశుద్ధ చవితి. ఈనాడు గణపతి పూజని మట్టితో చేసి ఆరాధించడమే విశేషంగా అన్ని గ్రంథాలూ వివరిస్తున్నాయి. గణేశ పురాణంలో విశేషించి చెప్తున్నది

    ‘భాద్రేమాసే సితేపక్షే చతుర్థ్యాం భక్తిమాన్నరః!

    కృత్వా మహీమయీం మూర్తిం గణేశస్య చతుర్భుజాం!!”

    భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితినాడు మట్టితో చేసిన నాలుగు చేతులతో ఉన్న గణపతి మూర్తిని పూజించాలి.

    మూర్తి ఎలా ఉండాలో కూడా శాస్త్రంలో చెప్పారు. అంతేకానీ ఆకర్షణల కోసమో, వికారాల కోసమో, క్రొత్త క్రొత్త మూర్తులను తయారుచేసి ఎన్నెన్నో చేతులు పెట్టేసి, క్రొత్త క్రొత్త రంగులు పూసి కాకుండా మట్టితో గణపతిని నాలుగు చేతుల వాడినే చేయాలి. అది కూడా అథర్వశీర్షోపనిషత్తులో చెప్పిన ప్రకారమే పాశము, అంకుశము, వరద, అభయ హస్తములతో ఉండాలి. ఒక్కొక్క సారి వరద అభయ హస్తముల బదులుగా ఒక హస్తంలో లడ్డుకాన్ని, మోదకాన్నో పెట్టడం కూడా కనబడుతుంది. అదేవిధంగా అభయ హస్తం పట్టిన చేతిలోనే ఒక భిన్న దంతాన్ని ఉంచడం కనబడుతుంది. ఇవి శాస్త్రం నిర్దేశించిన మూర్తులు.

    అశాస్త్రీయంగా మూర్తులు చేయరాదు.నూతనత్వం పేరుతోనో, అందరినీ ఆకర్షించడానికో క్రొత్త క్రొత్త వింత రూపాలు చేయకుండా మట్టితో కూడిన గణపతినే చేయాలి అనేవిధానం స్పష్టంగా గణేశపురాణం చెప్తోంది.

    అదేవిధంగా గణపతి ఆరాధనా సంబంధమైనటువంటి ఆగమ శాస్త్రాలలో, మంత్రశాస్త్రంలో కూడా చెప్పబడుతున్నది.

    మరొక విశేషమైన అంశం హిమవంతుని ద్వారా ఉపదేశాన్ని పొంది సాక్షాత్తు గౌరీదేవి శ్రావణశుద్ధ చతుర్థి నుంచి భాద్రపద శుద్ధ చతుర్థి వరకు మట్టితో చేసిన గణపతిని ఆరాధిస్తూ మాసవ్రతం చేసింది అని స్పష్టంగా పురాణం చెప్తున్నది. కనుక పార్థివ గణపతే ప్రధాన అంశం.

    శివునికి కూడా లింగారాధనలో పార్థివ లింగార్చన చెప్పబడుతున్నది. అంటే అన్ని ధాతువుల కంటే అన్నిరకాల రత్నాల కంటే మట్టితో చేసిన దానికే ఎక్కువ ప్రాధాన్యం కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఉన్నది మట్టితో, మనకు ఉన్నది మట్టి, మట్టిమీద ఆధారపడ్డ జీవితాలు మనవి. అందుకే మట్టిలో పరమాత్మని దర్శించేటటువంటి ఒకానొక అద్భుతమైన తత్త్వ దర్శనం, యోగదర్శనం పార్థివ గణపతి పూజలో ఉన్నది గనుక మట్టితో గణపతిని చేయాలన్నదే మనకు పురాణాది శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. అందుకే ‘భాద్రేమాసే సితేపక్షే’ అని చెప్పడంలో భాద్రపద మాసంలో వచ్చే ఈ చవితి మాత్రం మట్టితో చేసిన గణపతినే ఆరాధించాలి అని శాస్త్రం నిర్దేశిస్తున్నది.

    – వాట్సప్ సంచారి

    Pujarihamaina Matti Ganapati whatsaap sanchari
    Previous Articleఅంతర్వేదం
    Next Article వృద్ధుల జనాభాలో జపాన్ సరికొత్త రికార్డ్
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    తెలంగాణ భవన్‌లో సంత్‌ సేవాలాల్‌ జయంతి

    మంద కృష్ణకు పద్మ శ్రీ

    పద్మ శ్రీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

    దాశరథి శతజయంతి ఘనంగా నిర్వహించాలి

    నాకు భేషజాలు లేవు.. తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.