Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Arts & Literature

    పి.బి.శ్రీనివాస్ జ‌యంతి నేడు

    By Telugu GlobalSeptember 23, 20233 Mins Read
    పి.బి.శ్రీనివాస్ జ‌యంతి నేడు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    పి.బి.శ్రీనివాస్(సెప్టెంబరు 22, 1930 – ఏప్రిల్ 14, 2013)

    (పూర్తి పేరు ప్రతివాది భయంకర శ్రీనివాస్) చలనచిత్ర నేపథ్య గాయకుడు.

    తను తన మాతృభాష అయిన తెలుగులో కంటే కన్నడ, తమిళ చిత్రాలలో ఎక్కువ పాటలు పాడాడు. తను హిందీ, మలయాళం చిత్రాలలో కూడా పాటలు పాడాడు. కన్నడ నటదిగ్గజం రాజ్‌కుమార్‌కు ఇతను ఎన్నో గీతాలు ఆలపించాడు. తను తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్ల, సంస్కృత భాషలలో దిట్ట. తను ఎన్నో గజళ్లు వ్రాసాడు. ఇతను గళం సువర్ణ గళంగా గుర్తింపు పొందింది. తను మొట్టమొదటిసారిగా జాతక ఫలం చిత్రంలో పాడాడు. తను సుమారు 3000 లకు పైగా పాటలు పాడాడు.

    తను ఆంధ్రపదేశ్‌లో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణమునందు ఫణీంద్ర స్వామి, శేషగిరమ్మ దంపతులకు సెప్టెంబర్ 22, 1930న జన్మించాడు. తను కళాశాల చదివి బి.కాం. డిగ్రీని సంపాదించాడు. తన పూర్వీకులు పసలపూడి గ్రామానికి చెందినవారు.

    తను ఎనిమిది భాషలలో అనర్గళంగా మాట్లాడగలడు. అవి తెలుగు, కన్నడం, తమిళం, మళయాళం, హిందీ, ఉర్దూ, ఆంగ్లం. తను దేశంలోని ప్రధానమైన భాషలలో ఎన్నో పాటలు పాడినప్పటికీ ఎక్కువ పాటలను కన్నడ భాషలోనే పాడాడు. తెలుగు చిత్రాల్లో ఎన్నో ప్రజాదరణ పొందిన పాటలను తన మధుర గాత్రంతో ఆలపించాడు. శాంతినివాసం చిత్రంలో మహానటుడు నాగయ్య గారికి “శ్రీ రఘురాం జయ రఘురాం ” అనే పాటను పాడటం విశేషం.

    తండ్రిగారు సంస్కృత పండితులు కావటం వల్ల సంస్కృతం శ్రీనివాస్‌కి చిన్ననాడే అబ్బింది. ఫణీంద్రస్వామి కంటే తల్లి శేషగిరమ్మ దగ్గర‌ చనువెక్కువ. తండ్రి క్రమశిక్షణకు పెట్టింది పేరు. తల్లి సంస్కృత విదుషీతల్లజ. కిడాంబి వారింటి ఆడపడుచు. ఆమెది కోయిల గొంతు. సంగీతకోవిద. గురువుల నుంచి శ్రీనివాస్ నేర్చుకొన్నదేమన్నా ఉంటే అది తల్లి నుంచే. ఆమే అతనుకు ఆదిగురువు, తుది గురువు.

    తమిళనాడు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కరుణానిధి గారి నుంచి కలైమామణి పురస్కారాన్ని అందుకొన్నారు. ఇంకా కర్ణాటక ప్రభుత్వ పురస్కారాన్ని, శ్రీ రాఘవేంద్ర మఠం వారి ప్రతిష్ఠాత్మకమైన సంగీత కళానిధి పురస్కారాన్ని అందుకొని ఆస్థాన విద్వాంసులుగా నియమితులయ్యారు. కంచి జగద్గురుపీఠం నుంచి శ్రీ జయేంద్రసరస్వతుల నుంచి సంగీతరత్న, సంగీత నాథమణి బిరుదాలను స్వీకరించారు. ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి సంగీత సాహిత్యాలకు అందించిన సేవలకు గాను డాక్టరేట్ గౌరవాన్ని కూడా అందుకొన్నారు.

    శ్రీనివాస్ 1952లో జెమిని వారి హిందీ చిత్రం “మిస్టర్ సంపత్”తో తన చలనచిత్ర జీవితం ప్రారంభించాడు. అందులో తను పాడిన పాట “ఆజి హం భారత్ కీ నారి” ఒక యుగళ గీతం. దీనిని “గీతా దత్త్ “తో కలిసి పాడి ప్రాముఖ్యత పొందాడు. 1955 లో మళయాళ చిత్రం “హరిశ్చంద్ర”[5] లో పాడాడు. తను మొదటి సోలో సాంగ్ “ప్రేమ పాశం” చిత్రంలో పి.సుశీలతో పాడాడు. ఇది ఎంతో విశేషతను సంతరించుకుంది. తర్వాత కన్నడ కంఠీరవ రాజ్ కుమార్కు చాలా కాలంపాటు పాటలు పాడాడు. ఇవి విమర్శకులచే, అభిమానులచే, పరిశ్రమలచే కొనియాడబడ్డాయి. తమిళ పరిశ్రమలో జెమినీ గణేశన్ కు అనేక పాటలు పాడారు. తన పాటలలో పేరొందిన పాట “నిలవే ఎన్నిదం నెరుంగతె”. తను ఇతర నటులకు కూడా అనేక సందర్భాలలో పాటలు పాడాడు. ముఖ్యంగా కొన్ని పాటలను ఎం.జి.రామచంద్రన్, శివాజీ గణేశన్ లకు పాడాడు. 1964 లో మై భీ లడకీ హూ అనే హిందీ చిత్రంలో లతా మంగేష్కర్తో కలిసి పాడిన పాట “చందా సె హోగా వో ప్యారా” ఎంతో విశేషతను పొందింది. తన కంఠం తమిళంలో అనేక మంది నటులకు ఉపయోగపడింది. వారు జెమినీ గణేశన్, ముత్తురామన్, రవిచంద్రన్, జైశంకర్.

    “పావా మనిప్పు” అనే చిత్రంలో కన్నదాసన్ వ్రాసిన “కలగాలి ఆవల్ వసంతమ్” అనే పాటను ఎం.ఎస్.విశ్వనాథన్, టి.కె.రామమూర్తి గారి సంగీత సారథ్యంలో పాడాడు. అంజలీ పిక్చర్స్ వారి ఆడుతా వీట్టుప్పెన్ అనే చిత్రంలో కొన్ని పాటలు పాడాడు. శ్రీనివాస్ గాయనీమణులైన పి.సుశీల, ఎస్.జానకి, పి.భానుమతి, కె.జమునా రాణి, ఎల్.ఆర్.ఈశ్వరి, లతా మంగేష్కర్ ల సరసన పాడాడు.

    తను ఆధ్యాత్మిక పాటలను కూడా పాడాడు. అవి “శారదా భుజంగ స్తోత్రం”, “శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్”, “ముకుంద మాల”, “శ్రీ మల్లికార్జునస్తోత్రం”, పురందరదాసు సంకీర్తనలు.

    చైన్నై లోని అతను ఉంటున్న వుడ్‌లాండ్స్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో ఏ సమయములో అతనును సందర్శించినా ప్రశాంతంగా కవితలు వ్రాసుకుంటుండేవాడు

    పి.బి.శ్రీనివాస్ ఏప్రిల్ 14, 2013లో తన 82వయేట చెన్నైలోని ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు

    Playback Singer
    Previous Articleఅతీతురాలు (కథానిక )
    Next Article IT Returns | ఇక నుంచి మొత్తం శాల‌రీపై ఐటీ పే చేయాల్సిందే.. నో హెచ్ఆర్ఏ క్ల‌యిమ్‌.. తేల్చేసిన సీబీడీటీ!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.