Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    రాష్ట్రంలో రాక్షస పాలన.. చంద్రబాబుకు జగన్‌ వార్నింగ్‌

    By Telugu GlobalJuly 18, 20241 Min Read
    రాష్ట్రంలో రాక్షస పాలన.. చంద్రబాబుకు జగన్‌ వార్నింగ్‌
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    వినుకొండలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యపై స్పందించారు ఆ పార్టీ చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ట్వీట్ చేసిన జగన్‌.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు జగన్‌. వైసీపీని అణగదొక్కాలన్న కోణంలో దారుణాలకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

    కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఏపీ హత్యలు, అత్యాచారాలు, రాజకీయకక్షతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందన్నారు. వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్టగా అభివర్ణించారు జగన్. నడిరోడ్డుపై జరిగిన హత్య ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీస్ సహా అధికార యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారన్నారు. దీంతో రాష్ట్రంలో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని ఫైర్ అయ్యారు.

    ఇప్పటికైనా హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబుకు సూచించారు జగన్‌. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్రప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని అన్ని రకాలుగా అండగా ఉంటామని భ‌రోసా ఇచ్చారు జగన్. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

    Murder YCP worker
    Previous Articleఅల్లు అర్జున్, సుకుమార్ గొడవ.. తప్పు ఎవరిది?
    Next Article కపట నాటకాలకు కాలం చెల్లింది.. నారా లోకేష్ ఘాటు ట్వీట్
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.