Telugu Global
Andhra Pradesh

వృద్ధికి ఆరు కీలక రంగాలను గుర్తించిన కేంద్ర బడ్జెట్‌

దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తుకు ఈ బడ్జెట్‌ బ్లూప్రింట్‌గా పనిచేస్తుందన్న చంద్రబాబు

వృద్ధికి ఆరు కీలక రంగాలను గుర్తించిన కేంద్ర బడ్జెట్‌
X

కేంద్ర బడ్జెట్‌ 2025-26ను ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామామని అన్నారు. బడ్జెట్‌లో మహిళలు, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో వృద్ధికి ఆరు కీలక రంగాలను గుర్తించి బడ్జెట్‌ రూపొందించారు. జాతీయ శ్రేయస్సు వైపునకు కీలక అడుగులను ఈ బడ్జెట్‌ సూచిస్తున్నది. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తుకు ఈ బడ్జెట్‌ బ్లూప్రింట్‌గా పనిచేస్తుంది అని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం అభినందనలు తెలిపారు.

First Published:  1 Feb 2025 4:05 PM IST
Next Story