Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Monday, September 15
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    టీడీపీ నేత హత్య కేసులో సంచలన నిజాలు

    By Telugu GlobalAugust 18, 20241 Min Read
    టీడీపీ నేత హత్య కేసులో సంచలన నిజాలు
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం హోసూరులో 14వ తేదీ జరిగిన టీడీపీ నేత శ్రీనివాసరావు హత్య కేసులో సంచలన నిజాలు బయటికొస్తున్నాయి. సొంత పార్టీ నేతలే ఆయన్ని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. టీడీపీలో శ్రీనివాసరావుకు దక్కుతున్న ఆదరణ చూసి ఓర్వలేక.. కక్షగట్టి కిరాతకంగా చంపినట్లు నిర్ధారణ అయింది. టీడీపీకి చెందిన నలుగురు వ్యక్తులతో పాటు మరో ఇద్దరు మైనర్లకు శ్రీ‌నివాసరావు హత్యతో ప్రమేయం ఉన్నట్లు తేల్చారు. ప్రస్తుతం నిందితులంతా పోలీసుల అదుపులోనే ఉన్నారు. నేడోరేపో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ హత్యను మొదట వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేసింది టీడీపీ. మంత్రి నారా లోకేష్‌, ఎల్లో మీడియా నానా హంగామా సృష్టించింది. కానీ సొంతపార్టీ వాళ్లే చంపారని తేలడంతో ఇప్పుడు నోరు మెదపడం లేదు.

    వివరాల్లోకి వెళ్తే..

    శ్రీనివాసరావు హోసూరు మాజీ సర్పంచ్. ఇతనికి CRPF రిటైర్డ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌, టీడీపీ నేత నర్సింహులుతో కొంత కాలంగా విభేదాలున్నాయి. టీడీపీలో ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య స్థానికంగా చాలా గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఓసారి నర్సింహులును శ్రీనివాసరావు చెప్పుతో కొట్టాడు. అప్పటి నుంచి శ్రీనివాసరావుపై కక్ష పెంచుకున్నాడు నర్సింహులు. తాజాగా శ్రీనివాసరావుకు వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. ఇది జీర్ణించుకోలేక పోయిన నర్సింహులు గ్రామానికి చెందిన మరో నలుగురు టీడీపీ నేతల సహకారంతో శ్రీనివాసులును హత్య చేశారు. బహిర్భూమికి వెళ్లిన టైంలో రాడ్లతో కొట్టి చంపేశారు.

    Murder case Sensational facts
    Previous Articleమైక్రో న్యూట్రిషన్ గురించి తెలుసా?
    Next Article కెన‌డా, ఆస్ట్రేలియా, బ్రిట‌న్ ఆంక్ష‌లు.. అమెరికా వైపు భార‌త్ విద్యార్థుల చూపు..!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.