Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    ప్రజల చేత ఎన్నికై.. ఆ ప్రజలనే అవమానిస్తావా?

    By Telugu GlobalJuly 25, 20241 Min Read
    ప్రజల చేత ఎన్నికై.. ఆ ప్రజలనే అవమానిస్తావా?
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    సాక్షాత్తూ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఓటర్లపై నోటికొచ్చినట్టు మాట్లాడిన తీరు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. రాష్ట్ర ప్రజలపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు అందరినీ తీవ్ర విస్మయానికి గురిచేశాయి. ‘వైసీపీకి కూడా 40 శాతం మంది ఓట్లు వేశారంటే వాళ్లు అన్నం తినే వేశారా? మనసుతో ఆలోచించి ఓటు వేశారా? ఏవిధంగా ఓటు వేశారో అర్థం కావట్లేదు. వారి ఐదేళ్ల పరిపాలనను చూసిన తర్వాత కూడా ఈ విధంగా ఓట్లు వేయడంపై ఆలోచించాలి’ అంటూ విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలపై జనం మండిపడుతున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నికైన నాయకుడు సాక్షాత్తూ శాసనసభలో ప్రజలపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఇప్పటికే తీవ్రంగా ఖండించారు. మరోపక్క దక్షిణ భారత క్షత్రియ ఫెడరేషన్‌ ఈసీ మెంబర్‌ రాజాసాగి లక్ష్మీనరసింహరాజు కూడా బుధవారం విష్ణుకుమార్‌రాజు తీరును దుయ్యబట్టారు. ఎమ్మెల్యే విష్ణు కుమార్‌రాజు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తెలుగు ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మెప్పు పొందాలని నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. 40 శాతం ప్రజలు విజ్ఞతతోనే వైసీపీకి ఓటేశారని, కూటమి పేరుతో మూడు పార్టీలూ కలిసి ఎలా గెలిచాయో దేవుడికే తెలుసని ఆయన చెప్పారు.

    ప్రజలు అన్నమే తింటున్నారు.. నువ్వు ఏం తింటున్నావో ఒకసారి చూసుకో.. అంటూ ఆయన విష్ణుకుమార్‌రాజును దుయ్యబట్టారు. నువ్వు అన్నమే తింటే అలా మాట్లాడేవాడివి కాదు.. అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నికైన నువ్వు ఆ ప్రజలనే అవమానిస్తావా? నీకు సిగ్గే ఉంటే, అన్నమే తింటే.. వెంటనే 40 శాతం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే భవిష్యత్తులో నీకు ఘోర అవమానం తప్పదు.. అంటూ హెచ్చరించారు.

    Angry People
    Previous ArticleITR ఫైల్ చేస్తున్నారా.. బీకేర్ ఫుల్‌!
    Next Article ఖనిజాలపై రాయల్టీ హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.