Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    టీటీడీ చైర్మన్ పదవికోసం జనసేన నుంచి 50మంది పోటీ

    By Telugu GlobalJuly 16, 20242 Mins Read
    టీటీడీ చైర్మన్ పదవికోసం జనసేన నుంచి 50మంది పోటీ
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆ పదవి ఎవరికివ్వాలనే విషయంలో కూటమి ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. చాలామంది పేర్లు వినిపించినా చివరకు ఎవరూ ఫైనల్ కాలేదు. కానీ ఆ పదవి జనసేనకు ఖాయమనే ప్రచారం ఇప్పడు జోరందుకుంది. జనసేనకు చెందిన నేతల్లో ఒకరికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని అంటున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూర్చాయి.

    టీటీడీ చైర్మన్ పదవికి మొదటగా వినిపించిన పేరు నాగబాబు. ఆ వార్తల్ని వెంటనే ఆయన ఖండించారు కూడా. ఆ తర్వాత టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేసిన ఒకరిద్దరి పేర్లు కూడా వినిపించినా, ఏదీ వాస్తవం కాదు అని తేలిపోయింది. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరు కూడా వార్తల్లోకి వచ్చింది కానీ చంద్రబాబు ఇంకా ఎవరికీ ఆ పదవి ఖాయం చేయలేదని స్పష్టమైంది. తాజాగా జనసేన మీటింగ్ లో టీటీడీ చైర్మన్ పదవి గురించి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పదవికోసం చాలా పోటీ ఉందని, 50మందికి పైగా ఆ పదవి కావాలని తనను అడిగారని చెప్పారు. అయితే అందులో తమ కుటుంబ సభ్యులు లేరని క్లారిటీ ఇచ్చారు పవన్. మరి ఆ 50మందిలో ఆ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి.

    జనసేన ప్రజా ప్రతినిధుల సన్మాన సమావేశంలో నామినేటెడ్ పోస్ట్ ల ప్రస్తావన వచ్చింది. అవకాశాలు, అర్హతను బట్టి ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానన్నారు పవన్ కల్యాణ్. పార్టీలో ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద పోస్టులు ఆశిస్తున్నారని.. ఉన్న అవకాశాలు, కూటమి పార్టీల మధ్య పంపకాలను బట్టి పదవులు దక్కుతాయని చెప్పారు. పదవులు ఆశిస్తున్నవారు అర్హతను బట్టి అడిగితే కమిటీలో పెట్టి చర్చిస్తామని, పార్టీకి ఎలా పని చేశారో దాని ఆధారంగా పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు పవన్. 

    heavy competition Janasena
    Previous Articleఏపీలో మరో శ్వేతపత్రం విడుదల.. రీసర్వే నిలిపివేత
    Next Article జీపీఎస్ ఆగిపోయింది.. ఉద్యోగులు హ్యాపీయేనా..?
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.