Telugu Global
Andhra Pradesh

8వ తరగతి బాలికపై గ్యాస్ డెలివరీ బాయ్ అత్యాచారం, హ‌త్య‌!

స్కూల్ అయిపోగానే బాలుడొక్కడే ఇంటికి వచ్చాడు. చెల్లి ఏదని తల్లి ప్రశ్నించటంతో వెంటనే ఆ బాలుడు స్కూలుకు వెళ్లి టీచర్లను అడిగాడు. ఒంట్లో బాగోలేదని చెప్పి, మీ చెల్లి మధ్యాహ్నమే వెళ్లిపోయిందని వారు చెప్పారు.

8వ తరగతి బాలికపై గ్యాస్ డెలివరీ బాయ్ అత్యాచారం, హ‌త్య‌!
X


గుంటూరు జిల్లా చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలెంలో దారుణం జరిగింది. 8వ తరగతి చదువుతున్న శైలజ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. బాలిక డెడ్‌బాడీ అదే గ్రామంలోని గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నాగరాజు ఇంట్లో దొరికింది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. దీంతో అతడే బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

శైలజ, ఆమె అన్నయ్య ఎప్పటిలాగే సోమవారం ఉదయం స్కూల్‌కు వెళ్లారు. స్కూల్ అయిపోగానే బాలుడొక్కడే ఇంటికి వచ్చాడు. చెల్లి ఏదని తల్లి ప్రశ్నించటంతో వెంటనే ఆ బాలుడు స్కూలుకు వెళ్లి టీచర్లను అడిగాడు. ఒంట్లో బాగోలేదని చెప్పి, మీ చెల్లి మధ్యాహ్నమే వెళ్లిపోయిందని వారు చెప్పారు. దీంతో తల్లీ కుమారుడు కలిసి శైలజ కోసం గ్రామంలో వెతికారు. ఈ క్రమంలో గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నాగరాజు ఇంటి వద్ద చెల్లెలి చెప్పులు ఉండటాన్ని బాలిక అన్న గుర్తించాడు. కిటికీలో నుంచి చూస్తే చెల్లెలు మంచంపై విగతజీవిగా పడి ఉంది. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఇంటి తాళం పగలగొట్టి, బాలికను బయటకు తీసుకొచ్చారు.

బాలికను గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆస్ప‌త్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న బంధువులు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలికను ఒంటరిగా బయటకు పంపిన టీచర్లపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. నాగరాజుకు పెళ్లయినా మూడేళ్లుగా ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడు. పరారీలో ఉన్న నాగరాజుపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

First Published:  16 July 2024 7:06 AM GMT
Next Story