Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, September 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    ఏపీలో ఆరోగ్యశ్రీ తీసేస్తారా..? వైసీపీ వాదన ఏంటి..?

    By Telugu GlobalJuly 31, 20242 Mins Read
    ఏపీలో ఆరోగ్యశ్రీ తీసేస్తారా..? వైసీపీ వాదన ఏంటి..?
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీలో ఆరోగ్యశ్రీ అమలు కష్టం అవుతోందని, అందుకే అందరూ కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ లో చేరండని టీడీపీ నేతలు ఉచిత సలహాలిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీలో ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నారని కూడా వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ తీసేస్తే పేదలు కష్టాలపాలవుతారని, ఆ పాపం కూటమి ప్రభుత్వానికి శాపంలా మారుతుందని అంటున్నారు.

    ఇటీవల కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని ఆయన ఏపీ ప్రజలకు సూచించారు. దీంతో ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీని ఎత్తివేస్తున్నారనే ప్రచారం మొదలైంది. వైసీపీ నేతలు మరింత బలంగా ఈ వాదనను జనంలోకి తీసుకెళ్తున్నారు. మాజీ వైద్యఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ఇది చంద్రబాబు కుట్రగా అభివర్ణిస్తున్నారు.

    ఆరోగ్య శ్రీ అమలు కష్టం ,ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోండని కేంద్ర సహాయ మంత్రి @JaiTDP ఎంపీ పెమ్మసాని మాటల వెనక @ncbn ఉన్నాడేమో అనిపిస్తుంది.

    -విడదల రజిని గారు, మాజీ మంత్రి pic.twitter.com/vIcW8iyXQu

    — YSR Congress Party (@YSRCParty) July 31, 2024

    మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఏపీలో ఆరోగ్యశ్రీపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ట్వీట్ వేశారు. వైఎస్ఆర్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీకి అనారోగ్యం చేసిందని, కాపాడాలని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.

    అనారోగ్యానికి గురైన “YSR” మానసపుత్రిక “ఆరోగ్యశ్రీ “నీ కాపాడండి !@JaiTDP @naralokesh @ncbn @PemmasaniOnX

    — Ambati Rambabu (@AmbatiRambabu) July 31, 2024

    అటు టీడీపీ కౌంటర్లివ్వడం మొదలు పెట్టింది. వైసీపీ హయాంలో ఆరోగ్యశ్రీకి నిధులు లేకుండా చేశారని అంటున్నారు టీడీపీ నేతలు. ఆరోగ్యశ్రీకి రూ. 1600 కోట్లు బకాయిలు పెట్టి జగన్ వెళ్లిపోయారని, వైసీపీ పాలనలో ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తూ ఎన్నో సార్లు యాజమాన్యాలు ధర్నాకు దిగాయని గుర్తు చేశారు. గతంలో కూడా ఎంతో మంది పేదలకు ఆరోగ్యసేవలు అందలేదని, వైసీపీ నేతలు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా.. ఆస్పత్రుల్లో భోజనాలు సరఫరా చేసే వారికి కూడా బిల్లులు ఇవ్వలేని దుస్థితి నెలకొందని అన్నారు మంత్రి కొలుసు పార్థసారథి.

    ఆరోగ్యశ్రీలో కూడా రూ. 1600 కోట్లు బకాయిలు పెట్టి జగన్ వెళ్లిపోయాడు. వైసీపీ పాలనలో ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తూ ఎన్నో సార్లు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు ధర్నాకు దిగాయి. దీంతో ఎంతో మంది పేదలకు ఆరోగ్యం అందలేదు. వైసీపీ నేతలు చేసిన ఆర్థిక అవకతవకల… pic.twitter.com/tH9omMEQ9i

    — Telugu Desam Party (@JaiTDP) July 31, 2024

    ప్రస్తుతం ఆరోగ్యశ్రీ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఆరోగ్యశ్రీని నిండా ముంచేసింది వైసీపీ అని టీడీపీ నేతలు అంటుంటే, అసలు ఆరోగ్యశ్రీనే ముంచేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

    చూడమ్మా భారతి! ఆరోగ్యశ్రీ బకాయి పెట్టింది మీ శ్రీవారు. అది 1600 కోట్లు అని రాసింది మీ విష పుత్రిక సాక్షి. నీ భర్త చేతకానితనం, మూర్ఖత్వం గురించి నీకంటే గొప్పగా ఎవరికి తెలియదని సాక్షిలో రాతల ద్వారా నిరూపించావు.#FekuJagan #EndOfYCP #AndhraPradesh pic.twitter.com/HCdVPitier

    — Telugu Desam Party (@JaiTDP) July 31, 2024

    arogya sri latest update
    Previous Articleఒలింపిక్స్ హాకీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్!
    Next Article మారుతున్న కండువాలు.. స్పీడ్ మీదున్న స్థానిక నేతలు
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.