Telugu Global
Andhra Pradesh

ఎమ్మెల్యే కొలికపూడిపై చంద్రబాబుకు ఫిర్యాదు

మీడియా ప్రతినిధులను కించపరిచేలా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు

ఎమ్మెల్యే కొలికపూడిపై చంద్రబాబుకు ఫిర్యాదు
X

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తిరువూరు నుంచి తరలివచ్చిన మీడియా ప్రతినిధులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. మీడియా ప్రతినిధులను కించపరిచేలా ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని తెలిపారు. కొలికపూడి బెదిరించారంటూ కొన్ని ఆధారాలను ముఖ్యమంత్రికి అందజేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు అన్ని విషయాలు తెలుసున్న సీఎం.. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

టీడీపీ అంటే క్రమశిక్షణకు మారు పేరు అని చంద్రబాబు అండ్‌ కో గప్పాలు కొట్టుకుంటారు. కానీ ఆ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారశైలి వివాదాస్పదం అవుతున్నది. పార్టీపై చంద్రబాబు పట్టుకోల్పోతున్నారా? అనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. ఈసారి కొత్త చంద్రబాబును చూస్తారని ఇటీవల సీఎం వ్యాఖ్యానించారు. అయితే పార్టీలో కొంతమంది నేతలు అధినేతకు కొత్త తలనొప్పులు తెస్తున్నారని అంటున్నారు. రానున్న రోజుల్లో పార్టీపై దృష్టి సారించి నేతలను కట్టడి చేయకపోతే కష్టమే అనే వాదనలు వినిపిస్తున్నాయి.

First Published:  28 Sept 2024 1:29 PM GMT
Next Story