Telugu Global
Andhra Pradesh

రోడ్డెక్కాం, ఢిల్లీ వెళ్తున్నాం, మీ దహనం ఖాయం

రెడ్ బుక్ రాజ్యాంగమే టీడీపీని దహించి వేస్తుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. నారా లోకేష్ రెడ్ బుక్ ని గుర్తు చేస్తూ ఆయన ట్వీట్ వేశారు.

రోడ్డెక్కాం, ఢిల్లీ వెళ్తున్నాం, మీ దహనం ఖాయం
X

వినుకొండ ఘటనతో కూటమి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమంటున్నారు వైసీపీ నేతలు. ఆ ఘటన తర్వాత వైసీపీ మొత్తం ఏకమైందని, ఢిల్లీ స్థాయిలో కూటమి ప్రభుత్వ దారుణాలను ఎండగడతామంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగమే టీడీపీని దహించి వేస్తుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. నారా లోకేష్ రెడ్ బుక్ ని గుర్తు చేస్తూ ఆయన ట్వీట్ వేశారు.

మీ రెడ్ బుక్ మమ్మల్ని రోడ్డెక్కించింది..

మీ రెడ్ బుక్ మమ్మల్ని ఢిల్లీకి పంపిస్తోంది..

ఆ రెడ్ బుక్కే మిమ్మల్ని దహిస్తుంది.. అంటూ ట్వీట్ వేశారు అంబటి రాంబాబు. అంతకు ముందు ఆయన ఏపీలో శాంతి భద్రతల అంశంపై ఘాటుగా స్పందించారు. కేవలం వైసీపీ నేతల్ని టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతున్నాయని చెప్పారు. టీడీపీ బెదిరింపులకు వైసీపీ బెదరదని అన్నారు అంబటి.


వినుకొండలో రషీద్ కుటుంబాన్ని టీడీపీ నేతలు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు అంబటి. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. వినుకొండ ఘటనతోపాటు.. పుంగనూరులో మిథున్ రెడ్డి, వైసీపీ నేతలపై జరిగిన రాళ్లదాడిని కూడా ప్రస్తావించారు అంబటి. ఆ ఘటనలో బాధితులైన వైసీపీ నేతలపై కేసులు పెట్టడం హాస్యాస్పదం అన్నారు. మచ్చుమర్రి ఘటనలో దళితుడిని లాకప్ డెత్ చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపపై దళిత సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు అంబటి.

First Published:  22 July 2024 2:50 AM GMT
Next Story