ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్.. రూ.99 క్వార్టర్ లభ్యం

ఏపీలో రూ.99 క్వార్టర్ మద్యం బాటిల్ అందుబాటులోకి రానున్నాయిని ఎక్సైజ్ కమిషనర్ నిషంత్ కుమార్ తెలిపారు.

Advertisement
Update:2024-10-17 21:26 IST

ఏపీలో మందుబాబులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రూ.99 క్వార్టర్ మద్యం బాటిల్ అందుబాటులోకి రానున్నాయిని ఎక్సైజ్ కమిషనర్ నిషంత్ కుమార్ తెలిపారు. ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం రెడీగా ఉందని కమిషనర్ పేర్కొన్నారు. సర్కార్ గతంలో ప్రకటించిన విధంగా రూ.99లకు క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చింది. మద్యం తయారీ విక్రయాలలో జాతీయ స్దాయిలో పేరు ప్రతిష్టలు కలిగిన 5 సంస్దలు ఆంధ్రప్రదేశ్‌లో ఈ ధరకు లిక్కర్ విక్రయాలు చేసేందుకు సిద్దం అయ్యాయి. గురువారం నాటికి పదివేల కేసుల రూ.99 మద్యం మార్కెట్ కు చేరింది.

సోమవారం నాటికి రోజువారీ సరఫరా 20వేల కేసులకు చేరుతుంది. దపాలు వారిగా సప్లయ్ పెరిగి ఈ నెలాఖరు నాటికి 2,40,000 కేసుల మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉంటుంది. మొత్తంగా కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మధ్యం ఈ నెలలో అందుబాటులోకి వస్తుంది. వినియోగాన్ని బట్టి తదుపరి నెలలో ఏ మేరకు దిగుమతి చేసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాము అని కమిషనర్ నిషంత్ కుమార్ అన్నారు.

Tags:    
Advertisement

Similar News