సీఎం రేవంత్‌ కామెంట్స్ పై రేపు కౌంటర్ ఇవ్వనున్న కేటీఆర్

మూసీ ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన అర్థరహితమైన మీడియా సమావేశంపై రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో కీలకమైన ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ ద్వారా తెలిపారు.

Advertisement
Update:2024-10-17 19:49 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ మూసీ నదిపై నిర్వహించిన మీడియా సమావేశంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మూసీ పునరుజ్జీవం కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను రేపు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో కీలకమైన ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు కేటీఆర్ ఎక్స్ ద్వారా తెలిపారు. ఇవాళ మూసీ ప్రాజెక్ట్ గురించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై రేపు కౌంటర్ ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి తెలిపారు.

Tags:    
Advertisement

Similar News