యూట్యూబర్ హర్షసాయిపై మరో కేసు నమోదు
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ హర్షసాయిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.;
Advertisement
బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయటం లేదని, బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నాట్లు సజ్జనార్ తెలిపారు బెట్టి యాప్స్ వల్ల ఎంతో మంది నష్టపోతున్నారని వీటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఇక ఇప్పటికే ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన.. టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత, హర్షసాయి, వినయ్ కుయ్యా, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్, డేర్ స్టార్ గోపాల్, విజ్జు గౌడ్, శ్రీధర్ చాప వంటి యూట్యూబర్లను టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలిసింది. మరోవైపు వీ.సీ సజ్జనార్ తన సోషల్ మీడియా ఖాతాలో యువతలో అవేర్నెస్ కల్పిస్తున్నారు.
Advertisement