SSMB29.. ఆ ప‌నిలో బిజీ బిజీగా జ‌క్క‌న్న‌

ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న‌ దర్శకధీరుడు రాజమౌళి

Advertisement
Update: 2024-07-01 06:18 GMT

ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ వైడ్ గా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న‌ దర్శకధీరుడు రాజమౌళి.. తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదే తొలి ప్రాజెక్ట్. SSMB29 వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.

గత కొద్ది నెలల నుంచి జోరుగా ప్రీ ప్రొడక్షన్ ప‌నులు జరుగుతున్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కన్ఫామ్ చేశారు. ఎస్ఎస్ఎమ్‌బీ29లో మ‌హేష్ బాబు క్యారెక్ట‌ర్ ను ఇండియ‌న్ సినీ ప్రియుల‌తో పాటు హాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను సైతం మెప్పించే విధంగా జ‌క్క‌న్న డిజైన్ చేశార‌ట‌. ప్ర‌స్తుతం హీరో క్యారెక్ట‌ర్ కోసం మ‌హేష్ బాబుకు లుక్ టెస్ట్ చేసే ప‌నిలో ఆయ‌న బిజీ బిజీగా ఉన్నార‌ని తెలుస్తోంది.

ఇందులో భాగంగానే డిఫరెంట్ లుక్స్ ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. లుక్ టెస్ట్ కంప్లీట్ అవ్వ‌గానే నెక్స్ట్ వర్క్ షాప్ స్టార్ట్ అవుతుంద‌ని అంటున్నారు. కాగా, రాజ‌మౌళి ఈ ఫిల్మ్ ను పాన్ వ‌ర‌ల్డ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వాంచర్ మూవీ ఇది. ఈ సినిమాలో మ‌హేష్ బాబుకు జోడిగా హాలీవుడ్ హీరోయిన్ ను రంగంలోకి దింప‌బోతున్న‌ట్లు బ‌లంగా వార్త‌లు వ‌స్తున్నాయి. 2024 సెప్టెంబర్‌లో షూటింగ్ లాంఛ‌నంగా ప్రారంభం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News