ఐటీ ఆఫీసుకు దిల్‌ రాజు

వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఐటీ అధికారులు ఆయనకు నోటీసులు

Advertisement
Update:2025-02-04 10:46 IST

నిర్మాత దిల్‌ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన ఇంట్లో ఇన్‌కమ్‌ టాక్స్‌ అధికారులు సోదాలు జరిపిన విషయం విదితమే. వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఐటీ అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే డాక్యుమెంట్లు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను ఆయన ఐటీ అధికారులకు అందించినట్లు తెలుస్తోంది.. సంక్రాంతి పండగ సందర్భంగా దిల్‌రాజు భారీ బడ్జెట్‌ సినిమాలు రిలీజ్‌ చేశారు. దీంతో సినీ నిర్మాణం, సినిమాల విడుదల తర్వాత లాభాల వ్యవహారంపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. దిల్‌రాజుతో పాటు పలువురు డైరెక్టర్స్‌, ప్రొడ్యూసర్స్‌ ఇండ్లలోనూ ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. 

Tags:    
Advertisement

Similar News