సీఎం రేవంత్‌ రెడ్డితో గౌతమ్‌ అదానీ భేటీ

స్కిల్‌ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం అందజేత

Advertisement
Update:2024-10-18 17:16 IST

తెలంగాణలోకి అదానీ గ్రూప్‌ సంస్థల ఎంట్రీ చివరి అంకానికి చేరింది. ఓల్డ్‌ సిటీలో ఎలక్ట్రిసిటీ బిల్స్‌ వసూళ్లు, రెగ్యులేషన్‌ బాధ్యతలు అదానీకి అప్పగిస్తామని గతంలోనే సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇతర రంగాల్లోనూ అదానీ గ్రూప్‌ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈక్రమంలోనే సీఎం రేవంత్‌ రెడ్డితో అదానీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ శుక్రవారం భేటీ అయ్యారు. యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ ఫౌండేషన్‌ నుంచి రూ.100 కోట్ల విరాళం చెక్కు అందజేశారు. ఈ భేటీలో తెలంగాణలో పెట్టుబడులపై ముఖ్యమంత్రితో అదానీ చర్చించారు.

Tags:    
Advertisement

Similar News