శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తాం

నివేదిక సమర్పించడానికి కాలపరిమితి లేదన్నసిట్‌ చీఫ్‌ సర్వశ్రేష్ట త్రిపాఠి

Advertisement
Update:2024-09-29 13:13 IST

శ్రీవారి లడ్డూలో నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తామని సిట్‌ చీఫ్‌ సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. తిరుపతి తూర్పు పీఎస్‌లో నమోదైన కేసు సిట్‌కు బదిలీ అయ్యిందన్నారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్‌ డెయిరీపై విచారణ చేస్తామని పేర్కొన్నారు. డీఐజీ గోపినాథ్‌ జెట్టీ, హర్షవర్ధన్‌ రాజు, అదనపు ఎస్పీ వెంకటరావులు మూడు బృందాలుగా దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. దీనిపై నివేదిక సమర్పించడానికి కాలపరిమితి లేదన్నారు.

కల్లీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ రెండో రోజు కొనసాగుతున్నది. ఈ మేరకు తిరుపతి పోలీస్‌ అతిథి గృహంలో సిట్‌ సభ్యులు మరోసారి భేటీ అయ్యారు. టీటీడీ ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్‌ బృందం పరిశీలిస్తున్నది. టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం ఈవో శ్యామలరావును వారు కలవనున్నారు. ఆయనను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోనున్నారు. ఈ వ్యవహారంపై సిట్‌ సభ్యులు పలు ప్రాంతానికి వెళ్లి విచారణ చేపట్టనున్నారు.

దుండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌సంస్థను పరిశీలించడానికి తమిళనాడుకు వెళ్లనున్నారు. తిరుమలలో లడ్డూపోటు, విక్రయ కేంద్రాలను మరో బృందం పరిశీలించనున్నది. లడ్డూ తయారీ ముడి సరుకులపై ఆరా తీయనున్నది. నెయ్యి కొనుగోలు ఒప్పందాలను పరిశీలించనున్నది.

Tags:    
Advertisement

Similar News