బ్యాంకులో కుదువ పెట్టిన గోల్డ్ మాయం.. ఖాతాదారుల ఆగ్రహం

డబ్బులు అవసరం ఉండి బ్యాంకులో బంగారం తాకట్టు పెడితే ఇప్పుడు అసలుకే మోసం జరిగిపోయింది

Advertisement
Update:2025-02-16 16:43 IST

పైసాలు అవసరం ఉండి బ్యాంకులో గోల్డ్ తాకట్టు పెడితే ఇప్పుడు అసలుకే మోసం జరిగిపోయింది. తాకట్టు పెట్టిన బంగారం మాయం అయింది. తాకట్టు పెట్టించిన అప్రైజర్ కనిపించకుండా పోయారు. దీంతో ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఏపీలోని కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంటలో చోటుచేసుకుంది. తేటగుంటకు చెందిన ప్రజలు స్థానిక బ్యాంకులో గోల్డ్ కుదవ పెట్టి మనీ తీసుకున్నారు. ఇలా తీసుకున్న డబ్బులకు వడ్డీ కడుతూ వచ్చారు. జీవన పరిస్థితులు మెరుగుపడటంతో పూర్తి డబ్బులు కట్టేందుకు బ్యాంకుకు వెళ్లారు.

డబ్బు కట్టే సమయంలో బిగ్ షాక్కు గురయ్యారు. తాకట్టు పెట్టిన బంగారం బ్యాంకులో కనిపించలేదు. ఏం జరిగిందని ఆరా తీస్తే బంగారం తాకట్టు పెట్టించిన అప్రైజర్ కొట్టేశారని తెలిసింది. దాదాపు 160 మంది ఖాతాదారులకు చెందిన బంగారు నగలను మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఖాతాదారులు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్ స్పందించారు. బ్యాంకులో బంగారం మాయం అయిన విషయాన్ని నిర్ధారించారు. బ్యాంకు అప్రైజర్ గోల్డ్ చోరి చేశారని పేర్కొన్నాడు. మూడు, నాలుగు రోజుల్లో అందరికి న్యాయం చేస్తామని మేనేజర్ హామీ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News