రాయిపై పోస్ట్ మార్టం.. వైరల్ అవుతున్న వెల్లంపల్లి వీడియో

అప్పటి గాయానికి ఇప్పుడు జర్నలిస్ట్ లు పోస్ట్ మార్టమ్ చేస్తున్నారు. తాజాగా వెల్లంపల్లి ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారింది.

Advertisement
Update:2024-08-18 11:21 IST

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత, అప్పటి సీఎం జగన్ నుదుటిపై రాయి తగిలిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఆయనతోపాటు గాయపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. జగన్ నుదుడిపై ప్లాస్టర్ వేసుకుంటే, వెల్లంపల్లి పూర్తిగా కన్నుకి బ్యాండేజ్ వేసుకున్నారు. కొన్నిరోజుల తర్వాత ఆయన గాయం పూర్తిగా నయమైపోయింది. అయితే అప్పటి గాయానికి ఇప్పుడు జర్నలిస్ట్ లు పోస్ట్ మార్టమ్ చేస్తున్నారు. తాజాగా వెల్లంపల్లి ఇంటర్వ్యూ వీడియో వైరల్ గా మారింది.


"జగన్ మీ కంటై హైట్ ఉంటారు, కదా, మిమ్మల్ని తగిలిన రాయి ఆ తర్వాత ఆయనకు ఎలా తగిలింది..? మీకు కంటి వద్ద తగిలిన రాయి, ఆ తర్వాత మీకంటే ఎత్తులో ఉన్న జగన్ కి నుదుటిపై ఎలా తాకింది..?" అంటూ జర్నలిస్ట్ లు ప్రశ్నిస్తుంటే వెల్లంపల్లి ఆసక్తికర సమాధానాలు చెప్పారు. రాయి గాయం తర్వాత తాను కళ్లు మూసుకున్నానని, అక్కడేం జరిగింతో తనకు తెలియదన్నారు. రాయి తగిలింది మాత్రం వాస్తవం అని, తన ముక్కుకి పై భాగంలో దెబ్బ తగిలిందని, రెటీనాకి రాపిడి తగిలి కన్ను ఎర్రగా మారిపోయిందని చెప్పారు వెల్లంపల్లి.

రాయి గాయాన్ని అప్పట్లో ప్రతిపక్షాలు వెటకారం చేయగా, ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తున్న జర్నలిస్ట్ లు ఆ గాయం ఘటనని పోస్ట్ మార్టమ్ చేస్తూ చిత్ర విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారు. అంత సూటిగా రాయి విసిరిన వ్యక్తిని శిక్షించకుండా, శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్ కి పంపించాలంటున్నారు. ఇక 2019లో జగన్ పై కోడికత్తితో దాడి చేసిన నిందితుడికే ఇంకా న్యాయస్థానం శిక్ష వేయలేదు, ఇక రాయి కేసు ఎప్పటికి తేలుతుందో ఎవరికీ తెలియదు. 

Tags:    
Advertisement

Similar News