పిఠాపురంలో దళిత మైనర్ బాలికపై లైంగిక దాడి..టీడీపీ కార్యకర్తనే : కన్నబాబు

పిఠాపురంలో దళిత మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్తనే లైంగిక దాడి చేశాడని ఏపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏమవుతున్నాయి అని ప్రశ్నించారు

Advertisement
Update:2024-10-08 17:13 IST

పిఠాపురంలో దళిత మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్తనే లైంగిక దాడి చేశాడని ఏపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. పిఠాపురంలో ఓ మైనర్ బాలికకి మద్యం తాగించి అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుంది. ఇందిరానగర్ మాజీ కౌన్సిలర్ భర్త జాన్ బాబు.. మైనర్ బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారం చేశాడు. ఈ వ్యవహారంలో ఓ మహిళ కూడా అతనికి సహాయం చేసినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం రాత్రి బలవంతంగా ఆటో ఎక్కించుకొని డంపింగ్ యార్డ్ దగ్గరకు తీసుకెళ్లినట్టు ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే .అనంతరం బాలికను ఆటోలో తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నరు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని కన్నబాబు అన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఒత్తిళ్ళ మధ్య ఉన్నారా? రోజుకు ఎక్కడో చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి అని మాజీ మంత్రి ప్రశ్నించారు. ఓ సిఐ తల్లి అపహరణకు గురైంది. అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏమవుతున్నాయి అని ప్రశ్నించారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ హత్యాచార ఘటన బాధ కలిగించింది.. ఈ అమానుష చర్యను సభ్యసమాజంలోని ప్రతి ఒక్కరు ఖండించాలని పవన్ తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. బాధితురాలిని ఆదుకోవ‌డంతో పాటు నిందితుడికి క‌ఠిన శిక్ష ప‌డేలా చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.

Tags:    
Advertisement

Similar News