పిఠాపురం అత్యాచార ఘటన..పవన్‌పై రెచ్చిపోయిన రోజా

పిఠాపురం బాలికపై రేప్‌ కేసు విషయంలో.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ పై మాజీ మంత్రి రోజా రెచ్చిపోయారు.

Advertisement
Update:2024-10-09 16:22 IST

పిఠాపురంలో బాలికపై లైంగిక దాడి ఘటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ వేదికగా నిలదీశారు. "'ప‌వ‌న్ క‌ల్యాణ్ అన‌బ‌డే ఉప ముఖ్య‌మంత్రి గారూ' అంటూ ట్వీట్ చేసిన మాజీ మంత్రి.. దేవుడు త‌మ‌రికి పుట్టుక‌తో బుద్ధి, జ్ఞానం ఇచ్చి ఉంటే దాన్ని కాస్త ఉప‌యోగించండి స్వామి" అంటూ దుయ్య‌బ‌ట్టారు. దీంతో రోజా ట్వీట్‌పై జ‌న‌సేనాని ఆగ్రహం వ్యక్తం చేసింది. పిఠాపురానికి చెందిన బాలిక‌పై మాధ‌వ‌రం చెత్త డంపింగ్ వ‌ద్ద నిన్న సాయంత్రం జ‌రిగిన అఘాయిత్యం చాలా బాధ క‌లిగించింద‌ని అన్నారు. స్థానికులు నిందితుడిని ప‌ట్టుకుని పోలీసుల‌కు అప్ప‌గించార‌ని చెప్పిన ప‌వ‌న్‌.. ఈ లైంగిక దాడి ఘ‌ట‌న‌ను ప్ర‌తి ఒక్క‌రూ ఖండించాల‌ని కోరారు.

ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే వంగా గీత కాకినాడ జిజిహెచ్ సఖి సెంటర్ లో ఉన్న పిఠాపురం అత్యాచార మైనర్ బాలికను పరామర్శించారు అనంతరం వంగా గీత మాట్లాడుతూ… కాకినాడ జిల్లా క్రైమ్ పై డిప్యూటీ సీఎం పవన్ రివ్యూ చేయాలని డిమాండ్‌ చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు మహిళలు రోడ్లపై తిరిగితే స్వాతంత్రం వస్తుందని గాంధీ చెప్పారని.. పిఠాపురంలో మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు పై ఉన్న మహిళపై అత్యాచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అత్యాచారం నిందితుడు టీడీపీ వ్యక్తి అని తెలిపారు. నిందితుడుని కఠినంగా శిక్షించాలని వంగా గీత డిమాండ్‌ చేశారు. 

Tags:    
Advertisement

Similar News