పవన్‌ వారాహి యాత్రకు బ్రేక్.. ఎందుకంటే..?

పవన్‌కల్యాణ్ జ్వరంతో బాధపడుతుండడంతో డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో వెంటనే ఆయన రాజమండ్రి నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకున్నారు.

Advertisement
Update: 2024-03-31 15:10 GMT

జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ వారాహి యాత్రకు బ్రేక్ పడింది. ప్రచారానికి విరామం ఇచ్చి పవన్‌ మళ్లీ హైదరాబాద్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఐతే అనారోగ్య సమస్య కారణంగా పవన్‌ వారాహి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఆరోగ్యం కుదురుకున్నాకే తిరిగి ప్రచారం ప్రారంభిస్తారని సమాచారం.

రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ పిఠాపురంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్‌కల్యాణ్‌. పాదగయక్షేత్రంతో పాటు కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీ దేవి, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీపాద శ్రీ వల్లభుడికి పూజలు చేశారు. అనంతరం తెలుగుదేశం, బీజేపీ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఐతే పవన్‌కల్యాణ్ జ్వరంతో బాధపడుతుండడంతో డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో వెంటనే ఆయన రాజమండ్రి నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకున్నారు. విశ్రాంతి అనంతరం సోమవారం ఆయన తిరిగి పిఠాపురం వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags:    
Advertisement

Similar News