తన్ని లోపలేస్తాం.. యాంటీ రేబిస్ ఇంజెక్షన్ ఇస్తాం

గత ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ ఉపయోగపడలేదని, కనీసం నాయకుల జేబుల్లోనుంచి 10 రూపాయలు కూడా ఎవ్వరకీ ఇవ్వలేదన్నారు నాగబాబు.

Advertisement
Update: 2024-07-21 09:44 GMT

కొత్త ప్రభుత్వంపై కాట్లకుక్కల్లా వైసీపీ నేతలు మీద పడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన నేత నాగబాబు. పరిస్థితుల్ని బట్టి వారికి యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు ఇస్తామని, వారు చేసిన నేరాలకు తన్ని లోపలేసి తగిన ట్రీట్ మెంట్ ఇస్తామని హెచ్చరించారు. నేరాలు చేసిన వైసీపీ నేతలెవరూ తప్పించుకుని పోయే ప్రసక్తే లేదని, అందరి సంగతి తేలుస్తామని, వారు చేసిన ప్రతి పనికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్నారు నాగబాబు.


గత ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ ఉపయోగపడలేదని, కనీసం వారి జేబుల్లోనుంచి 10 రూపాయలు కూడా ఎవ్వరకీ ఇవ్వలేదన్నారు నాగబాబు. సంక్షేమ పథకాలకు ఇచ్చిన సొమ్మంతా ప్రభుత్వానిదని, దాన్ని వ్యక్తిగతంగా ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసం అన్నారు. సొంత సొమ్ము 10రూపాయలు ఇవ్వలేనివారు నాయకులు ఎలా అవుతారన్నారు నాగబాబు.

ఇటీవల వినుకొండ హత్య తర్వాత మాజీ సీఎం జగన్ పై నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పుడు వైసీపీ నేతల్ని ప్రత్యేకంగా విమర్శించారాయన. గత ప్రభుత్వానికి తాము 6 నెలలు సమయం ఇచ్చామని, ఆ తర్వాతే విమర్శలు చేశామన్నారు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలు ఆగలేకపోతున్నారని, నెలరోజుల్లోనే కాట్లకుక్కల్లా మీద పడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Tags:    
Advertisement

Similar News