భార్య గ్రాడ్యుయేషన్.. సింగపూర్‌లో పవన్

ఆయన రెండు రోజులుగా ఎక్కడా కనిపించలేదు. తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా సమీక్షలు జరపలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఏపీలో జరుగుతున్న ఘటనలపై ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వచ్చాయి.

Advertisement
Update: 2024-07-20 14:50 GMT

ఏపీలో వరుసగా హత్యలు, అత్యాచార ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలికపై అత్యాచారం, హత్య ఘటన జరిగినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరుపై విమర్శలు వచ్చాయి. రెండు రోజుల కిందట వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్య ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించలేదు.

ఏపీలో జరుగుతున్న అమానుష ఘటనలపై స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు పవన్ కళ్యాణ్ ను కోరుతుండగా.. ఆయన రెండు రోజులుగా ఎక్కడా కనిపించలేదు. తన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అధికారులతో కూడా సమీక్షలు జరపలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఏపీలో జరుగుతున్న ఘటనలపై ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వచ్చాయి.

ఈ ప్రశ్నల నేపథ్యంలో జనసేన పార్టీ స్పందించింది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు జనసేన పార్టీ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సింగపూర్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందగా.. పట్టా స్వీకరించేందుకు ఆమె సింగపూర్ వెళ్లారు. సతీమణి వెంట పవన్ కళ్యాణ్ కూడా సింగపూర్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సింగపూర్ యూనివర్సిటీ నుంచి అన్నా మాస్టర్స్ డిగ్రీ పట్టా స్వీకరించిన నేపథ్యంలో త్వరలోనే పవన్ కళ్యాణ్ తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారని తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News