మీకు మళ్లీ ఎందుకు ఛాన్సివ్వాలి?.. చంద్రబాబు, లోకేశ్‌పై మంత్రి రోజా ఫైర్..!

ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బాబు విమర్శలకు ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు దీటుగా సమాధానం చెప్పారు. కాగా మంత్రి రోజా తాజాగా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా స్పందించారు. ‘టీడీపీ పాలనను జనం చూశారు కదా.. వాళ్లు ఎంత దోపిడీ చేశారో? ఎన్ని బాధలు పెట్టారో ? ప్రజలు స్వయంగా అనుభవించారు కదా.. చంద్రబాబు నాయుడికి మరోసారి అధికారం ఎందుకు కట్టబెట్టాలి. జన్మభూమి కమిటీల […]

Advertisement
Update:2022-05-07 10:59 IST

ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బాబు విమర్శలకు ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు దీటుగా సమాధానం చెప్పారు. కాగా మంత్రి రోజా తాజాగా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా స్పందించారు.

‘టీడీపీ పాలనను జనం చూశారు కదా.. వాళ్లు ఎంత దోపిడీ చేశారో? ఎన్ని బాధలు పెట్టారో ? ప్రజలు స్వయంగా అనుభవించారు కదా.. చంద్రబాబు నాయుడికి మరోసారి అధికారం ఎందుకు కట్టబెట్టాలి. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను పీడించడానికా.. లేదంటే అడుగడుగునా అవినీతి చేయడానికా’ అంటూ ఆమె ప్రశ్నించారు.

చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. సొంతంగా పోటీచేసే ధైర్యం కూడా ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీచేసేందుకు జనసేన, బీజేపీ లాంటి పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని ఆ పార్టీ వెంపర్లాడుతోందని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు, చినబాబు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా.. ఎన్ని తప్పుడు హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. ఇటీవల మంత్రి రోజాపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై కూడా ఆమె స్పందించారు. ‘ అయ్యన్న పాత్రుడి ఇంట్లో మహిళలు లేరా? ఆయనకు తల్లి, భార్యా? లేరా? ఉంటే ఇంట్లో కూడా అలాగే మాట్లాడతారా? సంస్కారహీనుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే.. అంత మంచిది’ అని ఆమె పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News