పంచాయతీ ఓటర్ల తుది జాబితా విడుదల

రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ పంచాయతీ ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది.

Advertisement
Update:2024-10-03 17:43 IST

తెలంగాణ పంచాయితీ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 12,867 గ్రామ పంచాయితీల్లో 1,13,722 వార్డుల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. వీరిలో 82,04,518 పురుషులు, 85,28,573 మహిళలు, 493 ఇతర ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10,42,545 మంది ఓటర్లు, అత్యల్పంగా మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 64,397 మంది ఓటర్లు ఉన్నారు. ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో electoralsearch.eci.gov.in చెక్‌ చేసుకోండి.

Tags:    
Advertisement

Similar News