గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ నేతలు అరెస్ట్

శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా వెళ్లిన బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
Update:2024-10-19 16:33 IST

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా వెళ్లిన బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి సచివాలయం వైపు వెళ్తున్న శ్రీనివాస్ గౌడ్, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గ్రూపు-1 అభ్యర్థుల ఆందోళనతో సచివాలయం వద్ద పోలీసులు భారీ మోహరించారు. సచివాలయం వద్దకు చేరుకున్నారు గ్రూపు-1 అభ్యర్థులు. సచివాలయం వద్ద పోలీసులు, గ్రూపు-1 అభ్యర్థుల మధ్య తోపులాట జరుగుతోంది. దీంతో కాస్త ట్రాఫిక్ జామ్ అయింది.

గత కొద్ది రోజుల నుంచి గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం అశోక్ నగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ రోడ్డు పై బైఠాయించిన విషయం తెలిసిందే. గ్రూపు-1 అభ్యర్థులతో పాటు అశోక్ నగర్ చౌరస్తా నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు బండి సంజయ్. అక్కడ ఆయనను అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం మొండిగా జీవో 29 ర‌ద్దు చేయ‌కుండా.. గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌నుకోవ‌డం అప్ర‌జాస్వామని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవో 55ని పున‌రుద్ధ‌రించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలన్నారు. అప్ప‌టిదాకా గ్రూప్-1 మెయిన్స్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాలి ఆయన డిమాండ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News