ఒక్కో కార్మికుడికి రూ.93,750..దీపావళి బోనస్ విడుదల

దీపావళి బోనస్ కింద రూ.358 కోట్లు సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం విడుదల చేసింది.

Advertisement
Update:2024-10-24 16:52 IST

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. రాబోయే దీపావళి పండుగ సందర్బంగా కార్మికులకు పండగ బోనస్ ఇస్తున్నట్టు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీపావళి బోనస్ కింద రూ.358 కోట్లు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. రేపు ఉదయం వరకు కార్మికుల ఖాతాల్లో ఇవి జమ కానున్నట్టు భట్టి పేర్కొన్నారు.

పండగ బోనస్ గా ప్రతి కార్మికుడు రూ.93,750 అందుకోనున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై సింగరేణి కార్మిక సంఘాలు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కార్మికుడికి బోనస్‌గా రూ.93,750 రానున్నది. అంతకు ముందు లాభాల వాటా రూ. 796 కోట్లను కార్మికుడికి సగటున అందించిన విషయం తెలిసిందే. సగటున ఒక్కో ఉద్యోగికి రూ.1.90 లక్షలు అందజేసిన సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News