KrishnaVamsi | హీరోలు కాస్ట్ లీ అయిపోయారు

KrishnaVamsi - మహేష్ బాబు, రామ్ చరణ్ పై తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా వెల్లడించారు దర్శకుడు కృష్ణవంశీ. ఇంతకీ ఆయనేమన్నారు?

Advertisement
Update: 2024-07-19 15:50 GMT

సినిమా మేకింగ్ పై తనదైన శైలిలో స్పందించాడు దర్శకుడు కృష్ణవంశీ. ప్రస్తుతం సినిమా మేకింగ్ అత్యంత వ్యయభరితంగా మారిందని, మరీ ముఖ్యంగా హీరోలంతా చాలా కాస్ట్ లీ అయిపోయారని అన్నారు. తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఆయనీ స్టేట్ మెంట్ ఇచ్చారు.

మురారి సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకుడు. ఈ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసిన కృష్ణవంశీ, మహేష్ పై ఆసక్తికర ప్రకటన చేశారు.

మహేష్ తో తను భవిష్యత్తులో సినిమా చేయలేనని స్పష్టం చేశారు కృష్ణవంశీ. మహేష్ రేంజ్ చాలా పెద్దదని, రాజమౌళి సినిమాతో ఆయన అంతర్జాతీయ స్థాయికి చేరబోతున్నారని అంచనా వేశారు. అలాంటి హీరో తనతో సినిమా చేయడం కంటే.. హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ సినిమాలో నటిస్తే బాగుంటుందని, తను అదే కోరుకుంటున్నానని ఓపెన్ గా చెప్పారు.

ఇటు రామ్ చరణ్ తో మాత్రం తను కచ్చితంగా సినిమా చేస్తానని అన్నారు కృష్ణవంశీ. చరణ్ కు ఓ క్లాసిక్ లాంటి సినిమా బాకీ ఉన్నానని, ఆయన అవకాశం ఇస్తే కచ్చితంగా రుణం తీర్చుకుంటానని చెబుతున్నాడు. 

Tags:    
Advertisement

Similar News