ఏపీని వీడని వానగండం

మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన వాతావరణ శాఖ

Advertisement
Update:2024-09-26 15:49 IST

ఏపీని వాన గండం వీడటం లేదు. మరో రెండు రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఉత్తర కోస్తా, దక్షణ కోస్తా, ఒడిశాపై ఎక్కువగా ఉందని హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో వీచే అవకాశముందని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News