రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు.

Advertisement
Update:2024-10-11 18:53 IST

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. తెలంగాణ సాంస్కృతిక జీవనవిధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణకు నిత్య విజయాలు కలగాలని ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పంగల్లో దసరా ఒకటి. తెలుగు ప్రజలకు దసరా అతిపెద్ద పండగ.

ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో దసరా పండగ సందడి మొదలైంది దసరా రోజున కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట చేరి సామూహికంగా సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు.శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం.. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం.. శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని సీఎం గుర్తు చేశారు. తెలంగాణకు నిత్య విజయాలు కలిగాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని సీఎం దుర్గామాతను ప్రార్థించారు.

Tags:    
Advertisement

Similar News