Telugu Global
Telangana

వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి రిమూవ్ చేశారని ఇద్దరి హత్య

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం గోవిందాయిపల్లికి చెందిన బీజేపీ నేత జల్కం రవి ఈనెల 4న గ్రాండ్‌గా పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు. తర్వాత ఆ ఫొటోలను గ్రామ వాట్సాప్ గ్రూపులో షేర్ చేశాడు.

వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి రిమూవ్ చేశారని ఇద్దరి హత్య
X

వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి రిమూవ్ చేశారన్న కారణంతో ఇద్దరు యువకులను దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో జరిగింది. ఫార్చూన్ బటర్ ఫ్లయ్ సిటీ వెంచర్ విల్లాలో ఈ ఘటన జరిగింది.

ఇంతకీ ఏం జరిగిందంటే?

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం గోవిందాయిపల్లికి చెందిన బీజేపీ నేత జల్కం రవి ఈనెల 4న గ్రాండ్‌గా పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు. తర్వాత ఆ ఫొటోలను గ్రామ వాట్సాప్ గ్రూపులో షేర్ చేశాడు. అయితే ఈ విషయంపై అదే గ్రామానికి చెందిన శేషిగారి శివగౌడ్, గుండెమొని శివగౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఫొటోస్‌ను డిలీట్ చేసి.. జల్కం రవిని గ్రూపు నుంచి రిమూవ్ చేశారు. దీంతో ఆ ఇద్దరు యువకులపై కక్ష పెంచుకున్నాడు రవి.


ఇదే విషయంపై మాట్లాడేందుకు ఈ ఇద్దరు యువకులను వెంచర్‌లోని ఆఫీసుకు పిలిచాడు రవి. వారితో పాటు బీజేవైఎం నేత రాజు గౌడ్‌ను కూడా పిలిచాడు. తర్వాత నలుగురు కలిసి మందు తాగారు. తర్వాత తనను గ్రూప్ నుంచి ఎందుకు రిమూవ్ చేశారని అడగడంతో.. మాటమాట పెరిగింది. జల్కం రవి, రాజు.. శేషిగారి శివగౌడ్, గుండెమొని శివగౌడ్‌పై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో శేషిగారి శివగౌడ్, గుండెమొని శివగౌడ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

First Published:  7 Jun 2024 8:28 AM GMT
Next Story