Telugu Global
Telangana

బైక్‌ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి.. సంగారెడ్డి జిల్లాలో ఘటన

జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్ర‌మాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

బైక్‌ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి.. సంగారెడ్డి జిల్లాలో ఘటన
X

సంగారెడ్డి జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. బైక్‌ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. గురువారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పుల్కల్‌ మండలం గంగోజీపేటకు చెందిన సందీప్, నవీన్, అభిషేక్‌ కందిలోని అక్షయ పాత్రలో డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. వీరు విధుల‌కు హాజరయ్యేందుకు ఒకే బైక్‌పై ముగ్గురూ కలిసి వెళుతున్నారు.

కంది మండలం తునికిళ్ల తండా శివారుకు వచ్చేసరికి నాందేడ్‌ నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న లారీని వీరి బైక్‌ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్ర‌మాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

First Published:  25 July 2024 9:02 AM GMT
Next Story