Telugu Global
Telangana

చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి మరీ.. వెంటాడీ, వేటాడి..

కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో దారుణం చోటుచేసుకుంది. పచ్చునూరులో గ్యాంగ్‌వార్‌ను తలపించేలా మర్డర్ జరిగింది.

చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి మరీ.. వెంటాడీ, వేటాడి..
X

కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో దారుణం చోటుచేసుకుంది. పచ్చునూరులో గ్యాంగ్‌వార్‌ను తలపించేలా మర్డర్ జరిగింది. రౌడీషీటర్‌ గోపు ప్రశాంత్‌రెడ్డిని స్నేహితులతో కలిసి మరో రౌడీషీటర్‌ నన్నవేని రమేష్ అతి కిరాతకంగా చంపేశాడు. హత్యకు ముందు ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది. ఛాలెంజ్ చేసి మరీ ప్రశాంత్‌రెడ్డిని చంపేశాడు రమేష్.

నన్నవేని రమేష్, గోపు ప్రశాంత్‌రెడ్డి మధ్య భూ వివాదం ఉన్నట్లుగా తెలిసింది. 15 రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. చంపేస్తానని రమేష్‌ బెదిరించడంతో అతని కంటపడకుండా రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడు ప్రశాంత్. ప్రశాంత్ కోసం సోమవారం మొత్తం రెక్కీ నిర్వహించిన రమేష్.. మంగళవారం ఉదయం అతన్ని కిడ్నాప్ చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రమేష్ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు విఫలయత్నం చేశారు.

ప్రశాంత్‌ను భయంకరంగా టార్చర్‌ పెట్టి చంపింది రౌడీ షీటర్ రమేష్ గ్యాంగ్. వెంటాడి, వేటాడి మరీ చంపేశారు. ప్రత్యర్థుల నుంచి తప్పించుకునే క్రమంలో నీళ్లులేని బావిలో పడ్డ ప్రశాంత్‌రెడ్డిని.. రాళ్లతో కొట్టి, బీరు బాటిళ్లతో కొట్టారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక డెడ్‌బాడీని మానేరు నదిలో పడేసి పరారయ్యారు. 12 గంటలు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు పోలీసులు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని.. నిందితుల కోసం బృందాలుగా గాలిస్తున్నారు.

First Published:  29 May 2024 6:31 AM GMT
Next Story