5 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రూ.34 కోట్లు మంజూరు చేసిన కేసీఆర్ సర్కార్
6.80 కోట్ల అంచనాతో సిరిసిల్లలోని ప్రభుత్వ వైద్య కళాశాల కోసం సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న రెండో అంతస్తు పైన మరో అంతస్తు నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా కామారెడ్డిలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ.4.53 కోట్ల అంచనా వ్యయంతో కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలోని పాత టీబీ బ్లాక్లో అదనపు అంతస్తు, వార్డుల నిర్మాణం మంజూరైంది.

ఐదు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.34.38 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
6.80 కోట్ల అంచనాతో సిరిసిల్లలోని ప్రభుత్వ వైద్య కళాశాల కోసం సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న రెండో అంతస్తు పైన మరో అంతస్తు నిర్మాణం చేపట్టనున్నారు. అదేవిధంగా కామారెడ్డిలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ.4.53 కోట్ల అంచనా వ్యయంతో కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలోని పాత టీబీ బ్లాక్లో అదనపు అంతస్తు, వార్డుల నిర్మాణం మంజూరైంది.
వికారాబాద్లోని ప్రభుత్వ వైద్య కళాశాల కోసం, మొదటి సంవత్సరం విద్యార్థులకు వసతి కల్పించడానికి రూ.8 కోట్ల అంచనా వ్యయంతో అనంతగిరిలోని టీబీ & ఛాతీ ఆసుపత్రిలో ప్రస్తుత భవనంలో మార్పులు చేయబడతాయి. అదేవిధంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ప్రస్తుతం ఉన్న భవనంలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వసతి కల్పించేందుకు రూ.8.05 కోట్ల అంచనా వ్యయంతో మార్పులు చేర్పులు చేపట్టనున్నారు.
కరీంనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు వసతి కల్పించేందుకు రూ.7 కోట్ల అంచనా వ్యయంతో సీడ్స్ గోడౌన్ను పునరుద్ధరించనున్నారు.
తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ పనులు చేపట్టనుంది.