Telugu Global
Telangana

అయినను పోయి రావలె హస్తినకు

సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలతో సిల్వర్‌ జూబ్లీ చేశారని కేటీఆర్‌ సెటైర్స్‌

అయినను పోయి రావలె హస్తినకు
X

సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి 'అయినను పోయి రావలె హస్తిన' అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. సీఎం ఢిల్లీ పర్యటనలపై ఆయన 'ఎక్స్‌' వేదికగా సెటైర్స్‌ వేశారు. 'సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలతో రాష్ట్రానికి రూపాయి లాభం లేదు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలతో సిల్వర్‌ జూబ్లీ చేశారు. మూసీ హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్ట కొట్టారు. 420 హామీలను మడతపెట్టి మూలకు వేశారు. పండగలు లేవు.. ఆడబిడ్డలకు చీరలు అందలేదు. అవ్వాతాతలు అనుకున్న పింఛన్‌ లేదు. తులం బంగారం జాడే లేదు. అయినను పోయి రావలె హస్తినకు' అని రేవంత్‌ పాలనపై వ్యంగ్యంగా రాసుకొచ్చారు.

First Published:  17 Oct 2024 7:34 AM GMT
Next Story