Telugu Global
Telangana

రెండో రోజు ప్రశాంతంగా గ్రూప్-1 పరీక్షలు..69.4% హాజరు

తెలంగాణలో రెండో రోజు గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 69.4% హాజరైనట్లు ఆర్డిఓ జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.

రెండో రోజు ప్రశాంతంగా గ్రూప్-1 పరీక్షలు..69.4% హాజరు
X

తెలంగాణలో రెండో రోజు గ్రూప్-1 పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ పరీక్షలు నిర్వహించారు. రెండో రోజు గ్రూప్ 1 పరీక్షకు 21,817 మంది అభ్యర్థుల హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 69.4% హాజరైనట్లు ఆర్డిఓ జైపాల్ రెడ్డి పేర్కొన్నారు.

తొలిరోజు 22 వేల 744 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. మొత్తంగా 72.4 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా నిన్న ఒక్క నిమిషం ఆలస్యమైన కారణంగా కొందరు విద్యార్థులు పరీక్షకు దూరం అయ్యారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా కొనసాగింది. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించకపోవడం మినహా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కర ఘటనలు జరగలేదని TGPSC పేర్కొంది.

First Published:  22 Oct 2024 3:05 PM GMT
Next Story