మా హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ తెలియదు
కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉన్నది. దాన్ని అతిక్రమించకుండా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి ఉంటుందన్న విజయశాంతి

నేను గతంలోనూ కాంగ్రెస్లో పనిచేశారు. కానీ ఏనాడూ ఇది కావావాలని పార్టీని అడగలేదు. పార్టీ అధిష్ఠానం నాకు అవకాశం ఇచ్చినా.. నాకు వద్దు.. నేను ముందు పనిచేస్తానని అన్నాను అని ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతి అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఒక ఆలోచన.. ముందుచూపుతో రాష్ట్ర ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రకటించిందని ఇచ్చిన ప్రతీ హామీని ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేశాం. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు నేను తిరిగి కాంగ్రెస్లోకి వచ్చాను. పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అదే ఇస్తుంది. పార్టీలో ఉన్న వారంతా కొద్దిగా ఓపిక పట్టాలి. పార్టీ నాకు బాధ్యతలు అప్పగిస్తుందో. అప్పుడే మాట్లాడాలి. పనిచేయాలి అని అనుకున్నాను. అవకాశం కోసం ఎదురు చూశాను. కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉన్నది. దాన్ని అతిక్రమించకుండా ప్రతి ఒక్కరూ పనిచేయాల్సి ఉంటుంది. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా పోరాడుతామని అన్నారు.