Telugu Global
Telangana

ఎయిర్‌పోర్టు తీసుకొస్తానని మాట ఇచ్చా, తీసుకొచ్చా

తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో కీలకమైన పాత్ర పోషించారన్న సీఎం

ఎయిర్‌పోర్టు తీసుకొస్తానని మాట ఇచ్చా, తీసుకొచ్చా
X

ఉమ్మడి వరంగల్‌ ప్రాంతమంటే తనకు ఎంతో అభిమానమని సీఎం అన్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వరంగల్‌ గడ్డ నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు. హైదరాబాద్‌తో సమంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఓరుగల్లు గొప్ప చైతన్యం కలిగిన ప్రాంతమని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో కీలకమైన పాత్ర పోషించారని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ. 6500 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. గత ఎంపీ ఎన్నికల్లో వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్‌ను తీసుకొస్తానని మాటిస్తా.. చెప్పినట్టుగానే ఎయిర్‌పోర్టును తీసుకొస్తానని మాట ఇచ్చాను. చెప్పినట్టుగా ఎయిర్‌పోర్టు సాధించి మీ ముందు నిలుచున్నాను అన్నారు. కాజీపేట డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు.అనంతరం శివునిపల్లిలోని ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ.. కేసీఆర్‌ రూ. 8.29 లక్షల అప్పును మా నెత్తిమీద పెట్టిపోయారు. ఆయన చేసిన అప్పులకు ఒక్క ఏడాదిలోనే ఈ ప్రభుత్వం రూ. 84 వేల కోట్ల వడ్డీ, రూ. 64 వేల కోట్ల అసలు చెల్లించింది. రాష్‌ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. దీనికోసం ఇప్పటికే రూ. 5,500 కోట్లు కేటాయించాం. ఎన్నికల కోడ్‌ అడ్డుపెట్టుకొని కేసీఆర్‌ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు బంధు కింద రూ. 7,200 కోట్లు ఇచ్చాం. గ్రూప్‌ 1,2,3 పరీక్షలకు సవ్యంగా నిర్వహించి ఉద్యోగాలు ఇస్తున్నాం. అన్ని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కడియం శ్రీహరి అవసరం ఉందని చెప్పి పార్టీలోకి తీసుకొచ్చాం అన్నారు.

అంతకుముందు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం శివునిపల్లి కేంద్రం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.102.1 కోట్లతో మహిళాశక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు మంజూరు చేసిన 7 ఆర్టీసీ బస్సులను రేవంత్‌ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 48,717 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీగా 92 కోట్ల 74 లక్షల చెక్కును అందజేశారు. జనగామ జిల్లాలోని 1289 స్వయం సహాయ సంఘాలకు 100.93 కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు.

స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ. 630.27 కోట్లతో ప్రారంభించిన అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు. రూ.200 కోట్లతో జాఫర్‌గఢ్ మండలంలోని కోనాయాచలం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, రూ.5.5 కోట్లతో ఘన్‌పూర్‌లో డిగ్రీ కాలేజీ, రూ.45. 5 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, రూ.26 కోట్లతో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవల్ ఆఫీస్ కాంప్లెక్స్, రూ.148.76 కోట్లతో దేవాదుల రెండో దశ, RS ఘన్‌పూర్ ప్రధాన కాలువ లైనింగ్ పనులు, 512 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, పలు రహదారుల విస్తరణ, సబ్ స్టేషన్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులను ప్రారంభించారు.

First Published:  16 March 2025 4:30 PM IST
Next Story