కేసీఆర్ తో వద్దిరాజు, సండ్ర భేటీ
తన కుమారుడి వివాహానికి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
BY Naveen Kamera20 Sep 2024 2:08 PM GMT
X
Naveen Kamera Updated On: 20 Sep 2024 2:08 PM GMT
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ తో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవాం భేటీ అయ్యారు. ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ లో కేసీఆర్ ను వారిద్దరు మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాలని సండ్ర వెంకటవీరయ్య కేసీఆర్ ను ఆహ్వానించారు. ఇటీవల ఖమ్మంను ముంచెత్తిన వరదలు, సహాయక చర్యలు, ప్రజలకు వాటిల్లిన నష్టం ఇతర వివరాలను కేసీఆర్ వారిని అడిగి తెలుసుకున్నారు. ఆపద కాలంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల మధ్యే ఉండి వారికి మంచి సేవలు అందించారని అభినందించారు.
Next Story