గ్రూప్ -1 అభ్యర్థులపై లాఠీచార్జి
అశోక్ నగర్ లో ఉద్రిక్తత
BY Naveen Kamera18 Oct 2024 10:36 AM GMT
X
Naveen Kamera Updated On: 18 Oct 2024 10:36 AM GMT
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ అశోక్ నగర్ లో ఆందోళన చేస్తున్న గ్రూప్ -1 అభ్యర్థులపై పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం లాఠీచార్జీ చేశారు. కొందరిపై విచాక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో పలువురు అభ్యర్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రూప్ -1 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా నిరుద్యోగులు అశోక్ నగర్ లో ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం మరోసారి యువకులు ఆందోళనకు దిగడంతో సహనం కోల్పోయిన పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. దొరికిన వాళ్లను దొరికినట్టు లాఠీలతో కొట్టారు. దీంతో అశోక్ నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story