Telugu Global
Telangana

అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనపై కేటీఆర్ ఫైర్

సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం మీద దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు

అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటనపై కేటీఆర్ ఫైర్
X

సికింద్రాబాద్ మోండా మార్కెట్ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం పట్ల దారుణంగా ప్రవర్తించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఆయన ఎక్స్ వేదికగా ఖండించారు. గత కొన్ని నెలలుగా తెలంగాణలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని.. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం మీద జరిగిన దాడి ఆందోళన కలిగిస్తుందన్నారు..

దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇలాంటి తెలివితక్కువ చర్యలు మన హైదరాబాద్ నగరం సహనశీలతకు మచ్చను తీసుకు వస్తాయన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

First Published:  14 Oct 2024 3:15 PM GMT
Next Story