కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే.. కాగితాలు ఇచ్చిన సన్నాసులు మీరు
దమ్ముంటే రాహుల్గాంధీ.. అశోక్నగర్ కు రా.. చర్చ పెట్టి ఉద్యోగాల భర్తీ ఏమైందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ... అధికారంలోకి రాగానే తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలని రాహుల్ నరికిండు. నేడు బడ్జెట్ గురించి ప్రస్తావనే లేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి రాష్ట్రంలోని నిరుద్యోగులు నవ్వుతున్నారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే.. కాగితాలు ఇచ్చిన సన్నాసులు మీరు. 2 లక్షల ఉద్యోగాల గురించి డిమాండ్ చేశారు. దమ్ముంటే రాహుల్గాంధీ.. అశోక్నగర్ కు రా.. చర్చ పెట్టి ఉద్యోగాల భర్తీ ఏమైందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి, యువ వికాసం అన్నారు. వీటి గురించి ఒక్క మాట లేదు. విద్యా భరోసా కార్డు గురించి ప్రస్తావన లేదు. ఉన్న గురుకులాను నిర్వహించలేని అసమర్థులు వీరు అని ధ్వజమెత్తారు. 80 మందికి పైచిలుకు పిల్లలు చనిపోతే నివారించలేని వాళ్లు.. కొత్త స్కూల్స్ కడుతామని బిల్డప్ ఇస్తున్నారు. సిగ్గుపడాలని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.