Telugu Global
Telangana

అమెరికాలో హత్యకు గురైన విద్యార్థి కుటుంబానికి కేటీఆర్‌ పరామర్శ

గంప ప్రవీణ్‌ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌

అమెరికాలో హత్యకు గురైన విద్యార్థి కుటుంబానికి కేటీఆర్‌ పరామర్శ
X

అమెరికాలో దుండగుల చేతిలో హత్యకు గురైన షాద్‌ నగర్‌ నియోజకవర్గంలోని కేశంపేట మండలానికి చెందిన గంప ప్రవీణ్ కుటుంబ సభ్యులను బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. ప్రవీణ్‌ హత్యపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి తండ్రి రాఘవులు, ఇతర కుటుంబ సభ్యులతో గురువారం కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, ప్రవీణ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా దేశానికి రప్పించడానికి ఇండియన్‌ ఎంబసీతో మాట్లాడుతానని భరోసా ఇచ్చారు.


First Published:  6 March 2025 7:38 PM IST
Next Story